మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు చిత్రం మరికొద్ది రోజుల్లో..

- May 19, 2016 , by Maagulf
మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు చిత్రం మరికొద్ది రోజుల్లో..

 మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడుగా రూపుదిద్దుకోనున్న చిత్రం షూటింగ్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. 'బ్రహ్మోత్సవం' విడుదల తరువాత 15 రోజుల విరామం తీసుకుని ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు మహేశ్‌ ఇటీవల ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. 'మురుగదాస్‌ నా అభిమాన దర్శకుడు. 'గజిని' నుంచే ఆయనతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా. నా 'ఒక్కడు' సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. 'శ్రీమంతుడు' ప్రచారంలో భాగంగా ఓ సారి చెన్నై వెళ్లా. అప్పుడు మురుగదాస్‌ని కలిశా. ఆయన ఓ లైన్‌ చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. 'బ్రహ్మోత్సవం' తరువాత 15 రోజులు విశ్రాంతి తీసుకుని చిత్రీకరణ మొదలెడతాం' అని మహేశ్‌ తెలిపారు. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రాను అనుకుంటున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com