సౌదీ, జపాన్ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం
- September 08, 2023
రియాద్: సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా గురువారం రియాద్లోని తన కార్యాలయంలో జపాన్ కౌంటర్ యోషిమాసా హయాషిని కలుసుకున్నారు. సౌదీ-జపానీస్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చలకు సంబంధించి ఇరు పక్షాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.ఇది రెండు దేశాలు, వారి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందిని అధికార యంత్రాంగం పేర్కొంది. సౌదీ-జపానీస్ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశానికి ఇద్దరు మంత్రులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, నిరంతర సమన్వయం-సహకారంపై చర్చించారు. రాజకీయ వ్యవహారాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ సౌద్ అల్-సతీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆసియా దేశాల జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మహ్మద్ అల్-మత్రాఫీ, సౌదీ అరేబియాలోని జపాన్ రాయబారి ఫుమియో ఇవై ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







