సామాజిక కార్యకర్తల సహాయంతో స్వదేశానికి ఇండియన్ టూరిస్ట్
- September 08, 2023
యూఏఈ: పత్రాలు లేకుండా చాలా నెలలుగా యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయ జాతీయుడిని స్థానిక సామాజిక కార్యకర్తల సహాయంతో స్వదేశానికి తిరిగివెళ్లాడు. వివరాల్లోకి వెళితే..ముహ్సిన్ దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందినవాడు. 49 ఏళ్ల అతను మార్చి 2023లో విజిట్ వీసాపై యూఏఈకి వచ్చాడు. వెంటనే, అతను తన పాస్పోర్ట్ మరియు ఇతర పత్రాలతో కూడిన బ్యాగ్ను పోగొట్టుకున్నాడు. దీంతో భారతదేశానికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో వీసా స్టేటస్ ను మార్చుకోనందున ఓవర్స్టే జరిమానాలు భారీగా పెరిగాయి. అద్దె చెల్లించలేక పార్కులో ఉంటున్నాడు. అతన్ని ఒక పార్కులో గుర్తించిన సామాజిక కార్యకర్తలు విషయాలను అడిగి తెలుసుకొని సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ సలాం పప్పినిస్సేరి, సామాజిక కార్యకర్తలు సియాఫ్ మట్టంచెరి, రహీమా షనీద్ లు చొరవ తీసుకొని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (KMCC) నుండి దుబాయ్, షార్జా, అజ్మాన్ కార్మికులు అతనికి సహాయానికి కలిసి వచ్చారు. అతని ఓవర్స్టే జరిమానాలను మాఫీ చేయించడంతోపాటు దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ నుండి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్, అవుట్పాస్ వచ్చేలా కృషి చేశారు. దీంతో అల్ అవీర్ దేశం నుండి నిష్క్రమించడానికి మార్గం క్లియర్ అయింది. ఇటీవల కేరళకు తిరిగి వెళ్లిన ముహ్సిన్కు సామాజిక కార్యకర్తలు విమాన టిక్కెట్ను కూడా కొనిచ్చారు. యఏఈ ఇటీవలే ఓవర్స్టేయింగ్ జరిమానాలను ప్రామాణికం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, విజిట్, టూరిస్ట్ మరియు రెసిడెన్స్ వీసా ఓవర్ స్టేయింగ్ ఫీజులు రోజుకు 50 దిర్హామ్లుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







