ప్రపంచ నాయకులతో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను: ప్రధాని మోడీ

- September 08, 2023 , by Maagulf
ప్రపంచ నాయకులతో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను: ప్రధాని మోడీ

న్యూ ఢిల్లీ: 18వ G20 సదస్సుకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల్లో ప్రపంచ నాయకులతో ఉత్పాదక చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ థీమ్, ‘వసుధైవ కుటుంబం – ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ ప్రపంచ దృష్టికోణంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

‘‘జీ20 సదస్సులో మానవ-కేంద్రీకృత, సమ్మిళిత అభివృద్ధిలో కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందని తన గట్టి నమ్మకం. నిరుపేదలకు, క్యూలో ఉన్న చివరి వ్యక్తికి సేవ చేయాలనే గాంధీజీ లక్ష్యాన్ని అనుకరించడం చాలా ముఖ్యం. భారతదేశ జీ20 ప్రెసిడెన్సీ అందరినీ కలుపుకొని, ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా కార్యాచరణ-ఆధారితంగా ఉంది. సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి, సుస్థిర భవిష్యత్తు కోసం గ్రీన్ డెవలప్‌మెంట్ ఒడంబడికను, 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని ప్రధాని మోదీ అన్నారు.

రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. జి20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద నేతలు ఢిల్లీకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, అతిథులందరికీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో వారికి స్వాగతం పలుకుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com