సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్‌ బిన్‌తో ప్రధాని మోడీ భేటీ

- September 11, 2023 , by Maagulf
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్‌ బిన్‌తో ప్రధాని మోడీ భేటీ

న్యూఢిల్లీ: భారత్‌ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌తో సోమవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ రంగాలతో పాటు సాంస్కృతిక సహకారం వంటి ప్రధాన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. నేడు ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి ఇరువురు నేతలు అధ్యక్షత వహించారు. 2019లో రియాద్‌లో భారత్‌, సౌదీ అరేబియాల మధ్య జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా భారత్‌ను అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా భావిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రాంత, ప్రపంచ సంక్షేమం, స్థిరత్వం కోసం ఇరుదేశాల భాగస్వామ్యం కీలకమని అన్నారు. నేటి సమావేశం తమ బంధానికి కొత్త కోణాన్ని ఇచ్చిందని,  ప్రజల  కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com