అబుధాబి వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

- September 17, 2023 , by Maagulf
అబుధాబి వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూ ఢిల్లీ: అబుధాబి వెళుతున్న ఇండిగో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. లక్నో నుంచి అబుధాబికి వెళుతున్న ఇండిగో విమానం శనివారం రాత్రి 10:42 గంటలకు హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.155 మంది ప్రయాణికులతో విమానం రాత్రి 10:42 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది.

రెండు వారాల క్రితం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆగస్ట్‌లో ప్రయాణీకుడి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మరో ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ముంబయి నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. అస్వస్థతకు గురికావడంతో విమానంలో నుంచి దించి ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com