ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 500 పెట్రోల్ కార్లు సిద్ధం
- September 17, 2023
కువైట్: కొత్త విద్యా సంవత్సరం ఆదివారం ప్రారంభం కానున్నందున ట్రాఫిక్ను సులభతరం చేసేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని చర్యలను తీసుకుంటోంది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు కువైట్ చుట్టూ 500 పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ విభాగం ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 17 నాడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. సుమారు 43,500 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు, సుమారు 382,000 మంది ప్రాథమిక, ఇంటర్మీడియట్, మాధ్యమిక పాఠశాల విద్యార్థులు ఒకేసారి రోడ్డెక్కనుండటంతో రహదార్లపై రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ను తగ్గించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులకు అనువైన పని గంటలను ఆమోదించింది. తద్వారా మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఎప్పుడైనా హాజరు నమోదు చేయవచ్చు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







