ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 500 పెట్రోల్ కార్లు సిద్ధం
- September 17, 2023
కువైట్: కొత్త విద్యా సంవత్సరం ఆదివారం ప్రారంభం కానున్నందున ట్రాఫిక్ను సులభతరం చేసేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని చర్యలను తీసుకుంటోంది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు కువైట్ చుట్టూ 500 పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ విభాగం ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 17 నాడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. సుమారు 43,500 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు, సుమారు 382,000 మంది ప్రాథమిక, ఇంటర్మీడియట్, మాధ్యమిక పాఠశాల విద్యార్థులు ఒకేసారి రోడ్డెక్కనుండటంతో రహదార్లపై రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ను తగ్గించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులకు అనువైన పని గంటలను ఆమోదించింది. తద్వారా మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఎప్పుడైనా హాజరు నమోదు చేయవచ్చు.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!









