మతిమరుపుకు మందేయండిలా.!
- September 19, 2023వయసుతో పాటూ కాస్త చాదస్తం కూడా పెరుగుతుంటుంది. అలాగే పెరుగుతున్న వయసులో భాగంగా ఎక్కువగా ఎదుర్కొనే సమస్య.. మతిమరుఫు సమస్య. ఈ సమస్యకు మందుందా.? లేదా.? అనే సంగతి అటుంచితే.! పాలకూరను ఎక్కువగా తినే వారిలో మతి మరుపు సమస్య చాలా అరుదుగా వస్తుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
పాలకూర లేదా స్పినాచ్ అధికంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా వుంటుంది. ఈ ఆకుకూరలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటూ పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లుంటాయ్.
అవి శరీరానికి అత్యంత విలువైన శక్తినివ్వడమే కాకుండా, బ్రెయిన్ షార్ప్గా పని చేసేలా చేస్తాయట. అలాగే, బ్రెయిన్ క్యాన్సర్ తదితర సమస్యలు భవిష్యత్తులో దరి చేరనీయకుండా చేస్తాయట. మెదడు సక్రమంగా పని చేస్తే మతి మరుపు సమస్య వచ్చే అవకాశమే లేదుగా.!
అలా మెదడు ఆరోగ్యంలో అత్యంత కీలకంగా పని చేస్తుంది పాలకూర. అందుకే ఈ ఆకుకూరని తప్పకుండా మెనూలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వారంలో కనీసం మూడు, నాలుగు సార్లు పాలకూరను వివిధ రకాలుగా తీసుకోవడం వుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు