నకిలీ పాస్పోర్ట్ల ఎంటరైన ఆసియా జంటకు జైలుశిక్ష
- September 19, 2023
బహ్రెయిన్: నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి బహ్రెయిన్లోకి ప్రవేశించినందుకు ఒక ఆసియా జంటకు ఒక్కొక్కరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, బహిష్కరణ విధించబడింది. నిందితులు మలేషియా నుండి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లతో యూఏఈకి వచ్చారు. అవి వాస్తవానికి వారివి కావు.
కోర్టు ఫైల్స్ ప్రకారం, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారికంగా పాస్పోర్ట్లు స్టాంప్ చేయబడ్డాయి. ఇద్దరు నిందితులు రాజ్యంలోకి ప్రవేశించారు. మూడు రోజుల తర్వాత అవే పాస్పోర్ట్లను ఉపయోగించి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి, విమానాశ్రయ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారిని ప్రశ్నించడంతో అసల విషయం బయటికొచ్చింది. తమ దేశ పాస్పోర్ట్ లతో ప్రమాదం ఉంటుందని విన్నందున, బహ్రెయిన్లోకి ప్రవేశించడానికి ఇతరుల పాస్ పోర్టులను ఉపయోగించినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









