దుబాయ్ లో ఉమ్మితే భారీ జరిమానా
- June 25, 2015
దుబాయ్ లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడి అందాలను, పరిసర ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పాలకులు నిర్ణయించారు. పరిసర ప్రాంతాలను పాడు చేసి నిర్లక్షంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఎమిరేట్స్ అందాలను పాడు చేస్తున్న వారిని గుర్తించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేసింది. ఆ నిఘా వర్గాలు గుట్టు చప్పుడు కాకుండా వివిధ ప్రాంతాలలో సంచరించనున్నారు. దుబాయ్ లో ఎక్కడైనా రోడ్ల మీద, రోడ్ల పక్కన ఉమ్మి వేస్తే రూ. 17,000 వేలు (వెయ్యి దిర్హమ్స్) అపరాధ రుసుం విధించనున్నారు. అదే విధంగా రోడ్ల చుట్టు పక్కల ఉన్న గొడల మీద అనుమతి లేకుండా పోస్టర్లు అతికించినా రూ. 17,000 ఫైన్ కట్టవలసి ఉంటుంది. సముద్రంలోకి చమురు లీకేజ్ చేసిన వారికి రూ. 51,000, దుబాయ్ మునిసిపాలిటి చెత్త వాహనాలలో పురుగుల మందు క్యాన్ లు విసిరి వేస్తే రూ. 85,000 అపరాద రుసుం విధించాలని అక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించి దుబాయ్ ఆందాలను కాపాడటానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని పాలకులు అంటున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







