సౌదీలో స్కూల్ విద్యార్థినికి 18 ఏళ్ల జైలు..
- September 26, 2023
సౌదీ అరేబియా: గల్ఫ్ దేశాలలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.సోషల్ మీడియా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.గల్ఫ్ దేశాల్లో సోషల్ మీడియా వాడకం పై కఠిన ఆంక్షలు ఉన్నాయి. వాటి పై అవగాహన లేకుంటే మాత్రం జైలు, భారీ జరిమానాలు తప్పవు. ఇదే కోవలో తాజాగా సౌదీ అరేబియాలో ఓ ఘటన చోటు చేసుకుంది.
ఒక స్కూల్ విద్యార్థిని చేసిన పొరపాటు ఆమెను ఏకంగా 18 ఏళ్లపాటు కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది. తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా రాజకీయ ఖైదీలకు మద్దతుగా విద్యార్థిని చేసిన ట్వీట్ ఆమెను ఇలా దీర్ఘకాలం జైలుపాలు చేసింది. సౌదీ స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ ఆగస్టులో మనల్ అల్-గఫిరీకి శిక్షను విధించిందని సౌదీలో మానవ హక్కుల ఉల్లంఘనలను డాక్యుమెంట్ చేసే ఏఎల్క్యూఎస్టీ (ALQST) హక్కుల సంఘం శుక్రవారం వెల్లడించింది. కాగా, శిక్షపడిన విద్యార్థిని వయసు కేవలం 17 ఏళ్లు అని తెలిసింది.
క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాలనలో సౌదీ న్యాయవ్యవస్థ సైబర్ యాక్టివిజం, ప్రభుత్వాన్ని విమర్శించడానికి సోషల్ మీడియాను ఉపయోగించడంపై అనేక తీవ్రమైన జైలు శిక్షలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ట్విట్టర్, యూట్యూబ్ లో చేసిన వ్యాఖ్యలకు రిటైర్డ్ అధ్యాపకుడైన మొహమ్మద్ అల్-గమ్దీకి ఇటీవల మరణశిక్ష విధించడం జరిగింది. అలాగే లీడ్స్ యూనివర్శిటీ డాక్టరల్ అభ్యర్థి సల్మా అల్-షెహాబ్కు గతేడాది ఆయన చేసిన కొన్ని అభ్యంతరకర ట్వీట్లపై ఏకంగా 34 ఏళ్ల జైలు శిక్ష పడింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!