సౌదీ-యెమెన్ సరిహద్దులో డ్రోన్ దాడి.. ఇద్దరు బహ్రెయిన్ సైనికులు మృతి
- September 26, 2023
యూఏఈ: యెమెన్-సౌదీ సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్నక్రమంలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్ దాడిలో తమ అధికారి, సైనికుడు మరణించినట్లు బహ్రెయిన్ సైనిక కమాండ్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారని సైన్యం పేర్కొంది. సోదర సౌదీ అరేబియా దక్షిణ సరిహద్దులను రక్షించడానికి విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగిందని, ఇందులో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారని బహ్రెయిన్ సైనిక కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







