సౌదీ-యెమెన్ సరిహద్దులో డ్రోన్ దాడి.. ఇద్దరు బహ్రెయిన్ సైనికులు మృతి
- September 26, 2023
యూఏఈ: యెమెన్-సౌదీ సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్నక్రమంలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్ దాడిలో తమ అధికారి, సైనికుడు మరణించినట్లు బహ్రెయిన్ సైనిక కమాండ్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారని సైన్యం పేర్కొంది. సోదర సౌదీ అరేబియా దక్షిణ సరిహద్దులను రక్షించడానికి విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగిందని, ఇందులో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారని బహ్రెయిన్ సైనిక కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









