సౌదీ-యెమెన్ సరిహద్దులో డ్రోన్ దాడి.. ఇద్దరు బహ్రెయిన్ సైనికులు మృతి

- September 26, 2023 , by Maagulf
సౌదీ-యెమెన్ సరిహద్దులో డ్రోన్ దాడి.. ఇద్దరు బహ్రెయిన్ సైనికులు మృతి

యూఏఈ: యెమెన్-సౌదీ సరిహద్దులో పెట్రోలింగ్ చేస్తున్నక్రమంలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్ దాడిలో తమ అధికారి, సైనికుడు మరణించినట్లు బహ్రెయిన్ సైనిక కమాండ్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారని సైన్యం పేర్కొంది. సోదర సౌదీ అరేబియా దక్షిణ సరిహద్దులను రక్షించడానికి విధుల్లో ఉండగా ఈ ఘటన జరిగిందని, ఇందులో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారని బహ్రెయిన్ సైనిక కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com