యూఏఈ వాసులకు గుడ్ న్యూస్.. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- September 27, 2023
యూఏఈ: యూఏఈ వాసులకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. 75,000 టన్నుల మేర బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని యూఏఈకి ఎగుమతి చేసేందుకు అనుమతించింది. జూలై 20 నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధిం విధించిన విషయం తెలిసిందే. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా యూఏఈకి ఎగుమతులు అనుమతించబడుతున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సోమవారం సాయంత్రం తన నోటిఫికేషన్లో తెలిపింది. సింగపూర్కు “ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి” బియ్యం ఎగుమతిని అనుమతించాలని గత నెలలో భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్, యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్, చైనా, కోట్ డి ఐవోయిర్, టోగో, సెనెగల్, గినియా, వియత్నాం, జిబౌటి, మడగాస్కర్, కామెరూన్ సోమాలియా, మలేషియా మరియు లైబీరియాలు బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









