'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో శిల్పా యోగా తరగతులు
- May 21, 2016
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి యోగా తరగతులు నిర్వహించనుంది. ఈ విషయంపై శుక్రవారం శిల్పాశెట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజూ ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్నారు. యోగా తరగతులు నిర్వహించడానికి ఐఫా ఒక చక్కని వేదిక అని అభిప్రాయపడ్డారు. ఐఫా బృందం ప్రతి ఏడాది సరికొత్తగా ఉంటూ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోందన్నారు. వచ్చే నెల స్పెయిన్లో 17వ ఐఫా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 23 నుంచి 26 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సల్మాన్ఖాన్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హాతో పాటు పలువురు తారలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
తాజా వార్తలు
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !









