ప్రధాని మోదీని కలిసిన టిమ్కుక్
- May 21, 2016
భారత పర్యటనలో ఉన్న యాపిల్ అధినేత టిమ్కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. దిల్లీలోని 7 రేస్కోర్స్ రోడ్లో గల ప్రధాని అధికారిక నివాసంలో టిమ్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ మొబైల్ యాప్' అప్డేటెడ్ వెర్షన్ను టిమ్ ప్రారంభించారు.
భేటీ అనంతరం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ, టిమ్కుక్ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. టిమ్ చేతుల మీదుగా మొబైల్ యాప్ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు టిమ్కుక్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్కు మరోసారి రావాలనుందంటూ టిమ్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







