ప్రధాని మోదీని కలిసిన టిమ్‌కుక్‌

- May 21, 2016 , by Maagulf
ప్రధాని మోదీని కలిసిన టిమ్‌కుక్‌

భారత పర్యటనలో ఉన్న యాపిల్‌ అధినేత టిమ్‌కుక్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. దిల్లీలోని 7 రేస్‌కోర్స్‌ రోడ్‌లో గల ప్రధాని అధికారిక నివాసంలో టిమ్‌.. మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ మొబైల్‌ యాప్‌' అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను టిమ్‌ ప్రారంభించారు.
భేటీ అనంతరం ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ, టిమ్‌కుక్‌ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. టిమ్‌ చేతుల మీదుగా మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోదీ ట్వీట్‌ చేశారు. మరోవైపు టిమ్‌కుక్‌ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు మరోసారి రావాలనుందంటూ టిమ్‌ ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com