'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో శిల్పా యోగా తరగతులు
- May 21, 2016
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి యోగా తరగతులు నిర్వహించనుంది. ఈ విషయంపై శుక్రవారం శిల్పాశెట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజూ ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్నారు. యోగా తరగతులు నిర్వహించడానికి ఐఫా ఒక చక్కని వేదిక అని అభిప్రాయపడ్డారు. ఐఫా బృందం ప్రతి ఏడాది సరికొత్తగా ఉంటూ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోందన్నారు. వచ్చే నెల స్పెయిన్లో 17వ ఐఫా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 23 నుంచి 26 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సల్మాన్ఖాన్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హాతో పాటు పలువురు తారలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







