'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో శిల్పా యోగా తరగతులు

- May 21, 2016 , by Maagulf
'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో శిల్పా యోగా తరగతులు

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ(ఐఐఎఫ్‌ఏ) అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి యోగా తరగతులు నిర్వహించనుంది. ఈ విషయంపై శుక్రవారం శిల్పాశెట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజూ ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధన చేస్తున్నారు. యోగా తరగతులు నిర్వహించడానికి ఐఫా ఒక చక్కని వేదిక అని అభిప్రాయపడ్డారు. ఐఫా బృందం ప్రతి ఏడాది సరికొత్తగా ఉంటూ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తోందన్నారు. వచ్చే నెల స్పెయిన్‌లో 17వ ఐఫా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 23 నుంచి 26 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌, సోనాక్షి సిన్హాతో పాటు పలువురు తారలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com