దుబాయ్ అధికారిక చిహ్నంపై కొత్త చట్టం.. దుర్వినియోగం చేస్తే Dh500,000 జరిమానా

- October 03, 2023 , by Maagulf
దుబాయ్ అధికారిక చిహ్నంపై కొత్త చట్టం.. దుర్వినియోగం చేస్తే Dh500,000 జరిమానా

యూఏఈ: దుబాయ్ అధికారిక చిహ్నంపై కొత్త చట్టాన్ని సోమవారం ప్రకటించారు. కొత్త చట్టం ప్రకారం దుబాయ్ దాని స్వంత ప్రత్యేక చిహ్నాన్ని కలిగి ఉంటుంది.  దుబాయ్ పాలకుడు హోదాలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ చట్టాన్ని జారీ చేశారు. చిహ్నాన్ని ప్రభుత్వ సౌకర్యాలు, పత్రాలు మరియు వెబ్‌సైట్‌లలో.. అధికారిక కార్యక్రమాల సమయంలో ఉపయోగించవచ్చు. ప్రైవేట్ సంస్థలు దుబాయ్ పాలకుడు లేదా అతని ప్రతినిధి నుండి ముందస్తు అనుమతిని పొంది ఉపయోగించుకోవచ్చు. చిహ్నాన్ని దుర్వినియోగం చేస్తే మూడు నెలల నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై Dh100,000 నుండి Dh500,000 వరకు జరిమానా విధించబడుతుంది.  దుబాయ్ రూలర్ కోర్ట్ ఛైర్మన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుండి అమలులోకి వచ్చే చట్టం నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన నిర్ణయాలను జారీ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com