బాలయ్య తర్వాత అనిల్ రావిపూడి.! ఎవరితోనో తెలుసా.?
- October 05, 2023
అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ టచ్లో బిజీగా వుంది ‘భగవంత్ కేసరి’ టీమ్.
ఇదిలా వుంటే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు.? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తోంది.
అనిల్ రావిపూడి ఓ స్టోరీ లైన్తో మెగాస్టార్ చిరంజీవిని లాక్ చేసి పెట్టాడన్న ప్రచారం వుంది. అవును నిజమే.. చిరంజీవి కోసం ఓ స్టోరీ లైన్ సిద్ధం చేశారట. అది చిరంజీవికి కూడా బాగా నచ్చేసిందట. కలిసి చేద్దామని అన్నారట.
ఈ ప్రాజెక్ట్కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాబోతున్నారట. ‘భగవంత్ కేసరి’ పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేయాలనుకుంటున్నారట అనిల్ రావిపూడి. ప్రస్తుతం చిరంజీవి ఇమ్మీడియట్గా చేయబోతున్న ప్రాజెక్ట్ ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో. ఇటీవల మోకాలి సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న చిరంజీవి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కోసం సంసిద్ధం కానున్నారు.
చాలా తక్కువ టైమ్లోనే ఈ సినిమా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరంజీవి ఓ సినిమా చేయాల్సి వుంది. మరి, వశిష్ట సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ని ముందుగా చిరంజీవి పట్టాలెక్కిస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!









