ఇండియన్ ఎంబసీ ‘ఎక్స్ప్లోరింగ్ ఇన్క్రెడిబుల్ ఇండియా’ విజయవంతం
- October 12, 2023
కువైట్: కువైట్ మిలీనియం హోటల్ & కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 11న భారతదేశానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ‘ఎక్స్ప్లోరింగ్ ఇన్క్రెడిబుల్ ఇండియా’ పేరుతో B2B ఈవెంట్ను భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు పాల్గొన్నాయి. భారతదేశం నుండి తాజ్, ఒబెరాయ్ మరియు లీలా హోటల్ చైన్లకు చెందిన ప్రఖ్యాత హోటళ్లు టూరిజం సింపోజియం ఏర్పాటు చేశారు. ఈ సింపోజియమ్కు వివిధ వాటాదారులు, ముఖ్యంగా కువైట్ నుండి 150కి పైగా ట్రావెల్ ఏజెన్సీల అధిపతులు, ప్రతినిధులు బాగా హాజరయ్యారు. భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా భారతదేశానికి పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. భారతదేశంలోని విభిన్న పర్యాటక ప్రదేశాలు, ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాలు, భారతీయ సాంస్కృతిక వైభవం, డిజిటల్ అప్లికేషన్ల ద్వారా ప్రయాణ సౌలభ్యం, ఇతర దేశాలలో సారూప్య సౌకర్యాలతో పోలిస్తే ఆర్థికంగా చౌకగా ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







