భారత గడ్డ పై ఒలింపిక్స్ నిర్వహించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాం
- October 14, 2023
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 141వ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..
నలభై ఏళ్ల తర్వాత భారత్లో ఐఓసీ సెషన్ను నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. గత ఒలింపిక్స్లో పలువురు భారత క్రీడాకారులు మంచి ప్రదర్శన కనబరిచారన్నారు. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ చారిత్రాత్మక ప్రదర్శన చేసింది. అంతకు ముందు జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లోనూ మన యువ క్రీడాకారులు సరికొత్త రికార్డులు సృష్టించారని పేర్కొన్నారు. భారత గడ్డపై ఒలింపిక్స్ను నిర్వహించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ను విజయవంతంగా నిర్వహించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎలాంటి మలుపులు ఉండవన్నారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ.. 'ముంబైలో జరుగుతున్న 141వ ఐఓసీ సెషన్కు మీ అందరికీ స్వాగతం పలకడం గొప్ప గౌరవం. ఒలింపిక్ క్రీడలతో సహా అనేక విధాలుగా అగ్రగామిగా ఉన్న దేశం.. భారతదేశంలో ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజు ధానమంత్రి మోదీ ఇక్కడ ఉండటం మీ దేశంలో ఒలింపిక్ క్రీడలకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం.
మా IOC సెషన్ను నిర్వహించడానికి భారతదేశం నిజంగా స్ఫూర్తిదాయకమైన ప్రదేశం అని బాచ్ అన్నారు. ఉజ్వల చరిత్ర, చైతన్యవంతమైన వర్తమానం, భవిష్యత్తుపై విశ్వాసం కలగలిసిన దేశమిదని అన్నారు. జియో వరల్డ్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ మాట్లాడుతూ.. 'ఈ రోజు ప్రపంచానికి సోదరభావం, సంఘీభావం గతంలో కంటే ఎక్కువ అవసరం. ఇది యుద్ధభూమిలో జరగదు, ఆటస్థలాల్లో మాత్రమే జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







