‘టైగర్’ మ్యాజిక్ అంతలా వుందా.?
- October 18, 2023
మాస్ మహరాజా రవతేజ ‘ధమాకా’ సినిమాతో ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో ఇంకో హిట్ కొట్టేశాడు. దాంతో రవితేజలో హుషారు మరిన్ని రెట్లయ్యింది. వరుసగా కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడంతో పాటూ, సైమల్టేనియస్గా వాటిని పూర్తి చేస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగానే ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్కి సర్వం సిద్ధమైంది. ఈ శుక్రవారం సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. బయోపిక్ కావడంతో ఈ సినిమాపై కొన్ని అంచనాలున్నాయ్. ట్రైలర్కి మంచి రెస్సాన్స్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాలు వేరే లెవల్లో వుంటాయని ప్రచారం జరుగుతోంది.
అలాగే, ‘టైగర్ నాగేశ్వరరావు’ బిజినెస్ కూడా బాగా జరిగిందని అంటున్నారు. అది ఇంతవరకూ రవితేజ కెరీర్లో జరగని బిజినెస్ అంటున్నారు. దాదాపు 40 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటేనే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇక, ఈ సినిమాతో రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. ఆమె పాత్ర సర్ప్రైజింగ్గా వుండబోతోందట. అలాగే, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ వంటి హీరోయిన్లు మరో స్పెషల్ ఎలిమెంట్స్ ‘టైగర్ నాగేశ్వరరావు’కి. చూడాలి మరి, ఈ సారి మాస్ రాజా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







