సౌదీ అరేబియాలో 2030 నాటికి 60 లాజిస్టిక్స్ జోన్ల ఏర్పాటు
- October 20, 2023
బీజింగ్: 2030 నాటికి సౌదీ అరేబియాలో 60 లాజిస్టిక్స్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు సౌదీ ఎనర్జీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ చెప్పారు. బుధవారం బీజింగ్లో జరిగిన 3వ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సమ్మిట్లో అంతర్జాతీయ సహకార ఫోరమ్లో ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరియు సౌదీ విజన్ 2030’పై మంత్రి ప్రసంగించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సరఫరాపై ప్రభావాన్ని చూపాయని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ అన్నారు. సౌదీ అరేబియా, చైనాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం 2022 సంవత్సరానికి ముగింపుకు వచ్చిందని మంత్రి సూచించారు. సౌదీ విజన్ 2030 మరియు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మధ్య సామరస్య ప్రణాళికపై రెండు దేశాలు సంతకం చేశాయని, అన్ని రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం, పరస్పర అనుసంధానానికి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ నిర్వహించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సమ్మిట్కు గౌరవ అతిథిగా ఒమన్ మంత్రి హాజరయ్యారు. అక్టోబర్ 17, 18 తేదీలలో 130 కంటే ఎక్కువ దేశాల నుండి నాయకులు, అధికారులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









