ధోఫర్లో వారసత్వ, పర్యాటక ప్రదేశాలు మూసివేత
- October 22, 2023
సలాలా: తుఫాన్ "తేజ్" కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని అన్ని వారసత్వ ప్రదేశాలు, అనుబంధ పార్కులను ఆదివారం నుండి వచ్చే మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దోఫర్ గవర్నరేట్లోని పర్యాటకులందరూ బీచ్లు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇదిలావుండగా దోఫర్ గవర్నరేట్లోని వ్యవసాయ సంపద, మత్స్య మరియు జలవనరుల జనరల్ డైరెక్టరేట్ అన్ని రైతులు, పశువుల పెంపకందారులు, తేనెటీగల పెంపకందారులు తమ పశువులు, తేనెటీగల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. లోయ ప్రవాహాలు, ఆనకట్ట ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుండి దూరంగా సురక్షితమైన ప్రదేశాలకు తమ పశువులను మరియు తేనెటీగలను రవాణా చేయాలని పౌరులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







