ధోఫర్లో వారసత్వ, పర్యాటక ప్రదేశాలు మూసివేత
- October 22, 2023
సలాలా: తుఫాన్ "తేజ్" కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని అన్ని వారసత్వ ప్రదేశాలు, అనుబంధ పార్కులను ఆదివారం నుండి వచ్చే మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దోఫర్ గవర్నరేట్లోని పర్యాటకులందరూ బీచ్లు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇదిలావుండగా దోఫర్ గవర్నరేట్లోని వ్యవసాయ సంపద, మత్స్య మరియు జలవనరుల జనరల్ డైరెక్టరేట్ అన్ని రైతులు, పశువుల పెంపకందారులు, తేనెటీగల పెంపకందారులు తమ పశువులు, తేనెటీగల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. లోయ ప్రవాహాలు, ఆనకట్ట ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుండి దూరంగా సురక్షితమైన ప్రదేశాలకు తమ పశువులను మరియు తేనెటీగలను రవాణా చేయాలని పౌరులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







