ధోఫర్లో వారసత్వ, పర్యాటక ప్రదేశాలు మూసివేత
- October 22, 2023
సలాలా: తుఫాన్ "తేజ్" కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని అన్ని వారసత్వ ప్రదేశాలు, అనుబంధ పార్కులను ఆదివారం నుండి వచ్చే మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దోఫర్ గవర్నరేట్లోని పర్యాటకులందరూ బీచ్లు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇదిలావుండగా దోఫర్ గవర్నరేట్లోని వ్యవసాయ సంపద, మత్స్య మరియు జలవనరుల జనరల్ డైరెక్టరేట్ అన్ని రైతులు, పశువుల పెంపకందారులు, తేనెటీగల పెంపకందారులు తమ పశువులు, తేనెటీగల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. లోయ ప్రవాహాలు, ఆనకట్ట ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుండి దూరంగా సురక్షితమైన ప్రదేశాలకు తమ పశువులను మరియు తేనెటీగలను రవాణా చేయాలని పౌరులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







