ధోఫర్లో వారసత్వ, పర్యాటక ప్రదేశాలు మూసివేత
- October 22, 2023
సలాలా: తుఫాన్ "తేజ్" కారణంగా ధోఫర్ గవర్నరేట్లోని అన్ని వారసత్వ ప్రదేశాలు, అనుబంధ పార్కులను ఆదివారం నుండి వచ్చే మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దోఫర్ గవర్నరేట్లోని పర్యాటకులందరూ బీచ్లు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఇదిలావుండగా దోఫర్ గవర్నరేట్లోని వ్యవసాయ సంపద, మత్స్య మరియు జలవనరుల జనరల్ డైరెక్టరేట్ అన్ని రైతులు, పశువుల పెంపకందారులు, తేనెటీగల పెంపకందారులు తమ పశువులు, తేనెటీగల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. లోయ ప్రవాహాలు, ఆనకట్ట ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుండి దూరంగా సురక్షితమైన ప్రదేశాలకు తమ పశువులను మరియు తేనెటీగలను రవాణా చేయాలని పౌరులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









