AMR గ్రూప్ సంస్థలపై ముగిసిన ఐటీ సోదాలు

- October 22, 2023 , by Maagulf
AMR గ్రూప్ సంస్థలపై ముగిసిన ఐటీ సోదాలు

AMR కన్ స్ట్రక్షన్స్ కంపెనీలపై ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు ఐటీ, ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.15కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. బెంగళూరు కేంద్రంగా వివిధ పార్టీలకు ఏఎంఆర్ కంపెనీ డబ్బులు పంపిస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అటు పోలీసులు ఇటు ఎన్నికల సంఘం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.15 కోట్ల నగదు సీజ్ చేశారు. ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఏఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి బదిలీ అయినట్లుగా పోలీసులు, ఈసీ అధికారులు, ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి ఏఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీలతో పాటు కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు.

బెంగళూరు నుంచి తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు ఈ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇవ్వడానికి డబ్బు తరలిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్, బెంగళూరుతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో ఈసీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. కీలకమైన పత్రాలతో పాటు నగదు కూడా సీజ్ చేశారు.

బెంగళూరులో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతల నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు తెలుస్తోంది. నిజంగానే వారి ప్రమేయం ఉందా? లేదా? అన్నది తేల్చేందుకు అధికారులు ఆధారాలు గుర్తించే పనిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com