కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
- October 26, 2023
చిక్బళ్లాపూర్: కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం చిక్బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినవారిగా గుర్తించారు. గోరంట్ల నుంచి కర్ణాటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, ఈ ఘటనపై స్పందించిన చిక్ బళ్లాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి కుటుంబాలు బెంగళూరులోని హొంగసంద్రలో నివాసముంటున్నట్లు తెలిసింది. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.ఓ చిన్నారి సహా 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు మరణించారు. వాహనంలో ఉన్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!









