గాజాలో పౌరులే లక్ష్యంగా దాడులు.. ఖండించిన అరబ్ దేశాలు
- October 27, 2023
యూఏఈ: పౌరులను లక్ష్యంగా చేసుకోని ఇజ్రాయెట్ వైమానికి దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని యూఏఈ తోపాటు ఇతర ఎనిమిది అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, ఈజిప్ట్ మరియు మొరాకో విదేశాంగ మంత్రులు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లో తక్షణ మరియు స్థిరమైన కాల్పుల విరమణ కోసం UN భద్రతా మండలికి పిలుపునిచ్చారు. అక్టోబరు 21న ఈజిప్టు రాజధానిలో జరిగిన 'కైరో శాంతి శిఖరాగ్ర సదస్సు' తర్వాత తాజా ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా 1949 జెనీవా ఒప్పందాల ప్రోటోకాల్లను పాటించాల్సిన ఆవశ్యకతను అరబ్ దేశాలు గుర్తుచేసాయి. బాధిత పాలస్తీనా ప్రజలకు ఆర్థిక మరియు వస్తుపరమైన సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









