గాజాలో పౌరులే లక్ష్యంగా దాడులు.. ఖండించిన అరబ్ దేశాలు
- October 27, 2023
యూఏఈ: పౌరులను లక్ష్యంగా చేసుకోని ఇజ్రాయెట్ వైమానికి దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని యూఏఈ తోపాటు ఇతర ఎనిమిది అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, ఈజిప్ట్ మరియు మొరాకో విదేశాంగ మంత్రులు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లో తక్షణ మరియు స్థిరమైన కాల్పుల విరమణ కోసం UN భద్రతా మండలికి పిలుపునిచ్చారు. అక్టోబరు 21న ఈజిప్టు రాజధానిలో జరిగిన 'కైరో శాంతి శిఖరాగ్ర సదస్సు' తర్వాత తాజా ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా 1949 జెనీవా ఒప్పందాల ప్రోటోకాల్లను పాటించాల్సిన ఆవశ్యకతను అరబ్ దేశాలు గుర్తుచేసాయి. బాధిత పాలస్తీనా ప్రజలకు ఆర్థిక మరియు వస్తుపరమైన సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు









