గాజాలో పౌరులే లక్ష్యంగా దాడులు.. ఖండించిన అరబ్ దేశాలు
- October 27, 2023
యూఏఈ: పౌరులను లక్ష్యంగా చేసుకోని ఇజ్రాయెట్ వైమానికి దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని యూఏఈ తోపాటు ఇతర ఎనిమిది అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్, ఈజిప్ట్ మరియు మొరాకో విదేశాంగ మంత్రులు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజా స్ట్రిప్లో తక్షణ మరియు స్థిరమైన కాల్పుల విరమణ కోసం UN భద్రతా మండలికి పిలుపునిచ్చారు. అక్టోబరు 21న ఈజిప్టు రాజధానిలో జరిగిన 'కైరో శాంతి శిఖరాగ్ర సదస్సు' తర్వాత తాజా ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ మానవతా చట్టాలతో సహా 1949 జెనీవా ఒప్పందాల ప్రోటోకాల్లను పాటించాల్సిన ఆవశ్యకతను అరబ్ దేశాలు గుర్తుచేసాయి. బాధిత పాలస్తీనా ప్రజలకు ఆర్థిక మరియు వస్తుపరమైన సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







