త్వరలో.. విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం
- October 29, 2023
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత రెండో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు విజయవాడలో ప్రాంతీ య పాస్పోర్టు సేవా కేంద్రం(RPSK) మాత్రమే ఉంది. పూర్తిస్థాయి ప్రాంతీయ కార్యాలయం లేకపోవడంతో పాస్పోర్టుల ముద్రణ, డిస్పాచ్ అంతా విశాఖ కేంద్రంగానే జరుగుతోంది. ఇప్పుడు విజయవాడకు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాన్ని బందరు రోడ్డు వెంబడి గవర్నర్పేటలోని ఏజీ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇకపై పాస్పోర్టు సంబంధిత సమస్యల పరిష్కారానికి రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు విశాఖ వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండ దు. కాగా, విజయవాడ పాస్పోర్టు కార్యాలయం కొత్త సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని నూతన రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ కె.శివహర్ష అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రాలతో పాటు 13 పీవోపీఎ్సకేల్లో రోజుకు సగటున 2వేల చొప్పున ఇప్పటి వరకు 3 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







