త్వరలో.. విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం
- October 29, 2023
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత రెండో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు విజయవాడలో ప్రాంతీ య పాస్పోర్టు సేవా కేంద్రం(RPSK) మాత్రమే ఉంది. పూర్తిస్థాయి ప్రాంతీయ కార్యాలయం లేకపోవడంతో పాస్పోర్టుల ముద్రణ, డిస్పాచ్ అంతా విశాఖ కేంద్రంగానే జరుగుతోంది. ఇప్పుడు విజయవాడకు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాన్ని బందరు రోడ్డు వెంబడి గవర్నర్పేటలోని ఏజీ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇకపై పాస్పోర్టు సంబంధిత సమస్యల పరిష్కారానికి రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు విశాఖ వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండ దు. కాగా, విజయవాడ పాస్పోర్టు కార్యాలయం కొత్త సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని నూతన రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ కె.శివహర్ష అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రాలతో పాటు 13 పీవోపీఎ్సకేల్లో రోజుకు సగటున 2వేల చొప్పున ఇప్పటి వరకు 3 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







