మష్రూమ్ ఆమ్లెట్
- May 23, 2016
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ - 100 గ్రా., గుడ్లు - 3, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: మష్రూమ్స్ శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి కొద్ది నీటిలో 5 నిమిషాలు ఉడికించి వడకట్టాలి. ఒక లోతైన పాత్రలో గుడ్లు గిలకొట్టి ఉల్లి, మష్రూమ్స్, పచ్చిమిర్చి తరుగులతో పాటు పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై నూనె రాసి ఆమ్లెట్ వేసి, కొత్తిమీర తరుగు చల్లి, రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ టిఫిన్గా తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









