ఇజ్రాయెల్ ఆధీనంలో గాజా స్ట్రిప్!
- November 01, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దళాలు మంగళవారం గాజా స్ట్రిప్ లోపల హమాస్ మిలిటెంట్లతో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించాయి. సైన్యం దాడుల్లో పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు మరణించారు. అదే సమయంలో వైమానిక దాడులు కొనసాగాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలోని అల్ తవామ్ ప్రాంతంలో తమ యోధులు సైనికులతో మెరుపుదాడి చేశారని హమాస్ సాయుధ విభాగం తెలిపింది. ఉత్తర గాజా స్ట్రిప్లోని పశ్చిమ తవామ్లో దాడి చేసే (ఇజ్రాయెల్ సైన్యం) వాహనాలపై ఆకస్మికంగా కాల్పులు జరిపారని, మూడు జియోనిస్ట్ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో 800,000 మంది పాలస్తీనియన్లు ఇళ్లు వదిలి తరలిపోయినట్లు అంచనా. దాదాపు 672,000 మంది పాలస్తీనియన్లు తమ పాఠశాలలు, ఇతర సౌకర్యాలలో ఆశ్రయం పొందుతున్నారని UNRWA అని పిలువబడే పాలస్తీనియన్ శరణార్థుల కోసం UN ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటివరకు యుద్ధంలో పాలస్తీనాలో 8500 మంది, ఇజ్రాయెల్ లో 1400 మంది మరణించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







