ఇజ్రాయెల్ ఆధీనంలో గాజా స్ట్రిప్!
- November 01, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దళాలు మంగళవారం గాజా స్ట్రిప్ లోపల హమాస్ మిలిటెంట్లతో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించాయి. సైన్యం దాడుల్లో పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు మరణించారు. అదే సమయంలో వైమానిక దాడులు కొనసాగాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలోని అల్ తవామ్ ప్రాంతంలో తమ యోధులు సైనికులతో మెరుపుదాడి చేశారని హమాస్ సాయుధ విభాగం తెలిపింది. ఉత్తర గాజా స్ట్రిప్లోని పశ్చిమ తవామ్లో దాడి చేసే (ఇజ్రాయెల్ సైన్యం) వాహనాలపై ఆకస్మికంగా కాల్పులు జరిపారని, మూడు జియోనిస్ట్ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో 800,000 మంది పాలస్తీనియన్లు ఇళ్లు వదిలి తరలిపోయినట్లు అంచనా. దాదాపు 672,000 మంది పాలస్తీనియన్లు తమ పాఠశాలలు, ఇతర సౌకర్యాలలో ఆశ్రయం పొందుతున్నారని UNRWA అని పిలువబడే పాలస్తీనియన్ శరణార్థుల కోసం UN ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటివరకు యుద్ధంలో పాలస్తీనాలో 8500 మంది, ఇజ్రాయెల్ లో 1400 మంది మరణించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







