ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- November 08, 2023
దుబాయ్: వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులను మరో ఐసీసీ ఈవెంట్ పలకరించనుంది. అదే అండర్-19 పురుషుల ఆసియాకప్. ఈ టోర్నీ దుబాయ్ వేదికగా జరగనుంది. డిసెంబర్ 8 నుంచి 17 వరకు టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు కప్పు కోసం పోటీ పడనున్నాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లు ఉండగా గ్రూప్- బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ ఉన్నాయి. భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ మ్యాచులతో డిసెంబర్ 8న టోర్నీ ఆరంభం కానుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు టోర్నీ జరగనుంది. లీగ్ దశలో మ్యాచులు అన్నీ ఐసీసీ అకాడమీలో జరగనున్నాయి. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచులకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు డిసెంబర్ 10న తలపడనున్నాయి.
షెడ్యూల్ ఇదే..
డిసెంబర్ 8న – భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ వర్సెస్ నేపాల్
డిసెంబర్ 9న – బంగ్లాదేశ్ వర్సెస్ యూఏఈ, శ్రీలంక వర్సెస్ జపాన్
డిసెంబర్ 10న – భారత్ వర్సెస్ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వర్సెస్ నేపాల్
డిసెంబర్ 11న – శ్రీలంక వర్సెస్ యూఏఈ, బంగ్లాదేశ్ వర్సెస్ జపాన్
డిసెంబర్ 12న – పాకిస్తాన్ వర్సెస్ అఫ్గానిస్తాన్, భారత్ వర్సెస్ నేపాల్
డిసెంబర్ 13న – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, యూఏఈ వర్సెస్ జపాన్ ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచులు అన్ని ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం







