మస్కట్లో ఒమానీ-సౌదీ కోఆర్డినేషన్ కౌన్సిల్ తొలి సమావేశం
- November 14, 2023
మస్కట్: ఒమానీ-సౌదీ కోఆర్డినేషన్ కౌన్సిల్ తొలి సమావేశం సోమవారం మస్కట్లో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ మరియు సౌదీ అరేబియా (KSA) విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ ఫర్హాన్ అల్ సౌద్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించి, సాధించిన సానుకూల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యల పట్ల సమన్వయాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించారు.
ఈ సందర్భంగా సయ్యద్ బదర్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఒమానీ-సౌదీ సంబంధాలు వివిధ రంగాలలో స్థిరమైన వృద్ధిని సాధించాయన్నారు. పెట్టుబడి కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2022లో రెండు దేశాల మధ్య రూబ్-ఎల్-ఖాలీ ల్యాండ్ పోర్టును ప్రారంభించడం వల్ల రెండు దేశాల మధ్య భూ రవాణాకు ఊపు వచ్చిందని సయ్యద్ బదర్ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన ప్రాజెక్టులు మరియు హైడ్రోజన్ ఉత్పత్తి రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలలో ముందంజలో ఉన్నాయని అన్నారు. ఇది ఇంధనం, లాజిస్టిక్స్, సముద్ర రవాణా మరియు మౌలిక సదుపాయాల రంగాలలో సహకారానికి దోహదం చేసిందన్నారు.
రెండు దేశాల నాయకత్వాల ఆధ్వర్యంలో సౌదీ-ఒమానీ సంబంధాలు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయని ప్రిన్స్ ఫైసల్ అన్నారు. రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను సాధించడమే కాకుండా, ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని నెలకొల్పడానికి దోహదపడిందన్నారు. పెట్టుబడి వనరుల నుండి ప్రయోజనాలను పెంచుకోవడంలో రెండు దేశాల ఉమ్మడి చర్య కోసం కౌన్సిల్ ఒక పోడియంను ఏర్పాటు చేస్తుందని ప్రిన్స్ ఫైసల్ తెలిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై సమన్వయాన్ని కొనసాగించడం, ఉమ్మడి ఆసక్తి ఉన్న అన్ని విషయాలపై రాజకీయ సంప్రదింపులను పెంపొందించడం, అన్ని సమస్యలపై ఏకాభిప్రాయం సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోఆర్డినేషన్ కౌన్సిల్, దాని సబ్కమిటీలు (రాజకీయ, భద్రత, ఆర్థిక, పెట్టుబడి వ్యవహారాలు) తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, జలమార్గాలను రక్షించడం, పునరుత్పాదక మరియు స్వచ్ఛమైన ఇంధన వనరులను అభివృద్ధి చేయడం వంటి వివిధ సమస్యలను పరిష్కరించడంలో సహకారాన్ని మరింతగా పెంచడానికి సమర్థవంతమైన పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సబ్కమిటీల అధిపతులు, సెక్రటేరియట్ జనరల్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం









