సందర్శకులను ఆకట్టుకుంటున్న దుబాయ్ ఎయిర్షో
- November 14, 2023
యూఏఈ: దుబాయ్ ఎయిర్షో 2023లో సోమవారం దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూఏఈ ఏవియేషన్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకునే ఫ్లైబై సామర్థ్యాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రయాణీకుల విమానం ఐకానిక్ ఎమిరేట్స్ A380, యూఏఈ ఎయిర్ డిస్ప్లే టీమ్, అల్ ఫుర్సాన్ ఇందులో పాల్గొన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు స్మోక్ ట్రయల్స్ ప్రేక్షలను ఆకట్టుకున్నది. ఎమిరేట్స్ బోయింగ్ 777, ఎతిహాద్ ఎయిర్బస్ 350, ఎయిర్ అరేబియా ఎయిర్బస్ 320 మరియు ఫ్లైదుబాయి బోయింగ్ 737 ఆకాశంలో అద్భుతంగా దూసుకుపోయాయి. వందలాది మంది ప్రేక్షకులు ఆ క్షణాలను వారి కెమెరాలలో బంధించారు. ఎయిర్ షో నవంబర్ 17 వరకు జరుగనుంది. వైమానికి ప్రదర్శనలు దుబాయ్ వరల్డ్ సెంటర్లోని స్కైవ్యూ గ్రాండ్స్టాండ్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!









