సందర్శకులను ఆకట్టుకుంటున్న దుబాయ్ ఎయిర్షో
- November 14, 2023
యూఏఈ: దుబాయ్ ఎయిర్షో 2023లో సోమవారం దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూఏఈ ఏవియేషన్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకునే ఫ్లైబై సామర్థ్యాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రయాణీకుల విమానం ఐకానిక్ ఎమిరేట్స్ A380, యూఏఈ ఎయిర్ డిస్ప్లే టీమ్, అల్ ఫుర్సాన్ ఇందులో పాల్గొన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు స్మోక్ ట్రయల్స్ ప్రేక్షలను ఆకట్టుకున్నది. ఎమిరేట్స్ బోయింగ్ 777, ఎతిహాద్ ఎయిర్బస్ 350, ఎయిర్ అరేబియా ఎయిర్బస్ 320 మరియు ఫ్లైదుబాయి బోయింగ్ 737 ఆకాశంలో అద్భుతంగా దూసుకుపోయాయి. వందలాది మంది ప్రేక్షకులు ఆ క్షణాలను వారి కెమెరాలలో బంధించారు. ఎయిర్ షో నవంబర్ 17 వరకు జరుగనుంది. వైమానికి ప్రదర్శనలు దుబాయ్ వరల్డ్ సెంటర్లోని స్కైవ్యూ గ్రాండ్స్టాండ్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







