వింటర్లో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.!
- November 16, 2023చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా వుంటుంది. తద్వారా అనేక రకాల జబ్బులు ఈజీగా ఎటాక్ చేస్తుంటాయ్. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయ్.
వాటి నుంచి తట్టుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి ఈ కాలంలో. ఈ కాలంలో వచ్చే శీతాఫలంతో పాటూ, ‘సి’ విటమిన్ అధికంగా వుండే నారింజ పండును ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ కాలంలో వచ్చే ఫ్లూ నుంచి శరీరం తట్టుకోవడానికి తగినంత ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాయ్.. అలాగే, బొప్పాయి పండు కూడా.
చలికాలంలో చర్మం ముడుచుకుపోవడాన్ని బొప్పాయి నియంత్రిస్తుంది. శరీరానికి తగినంత తేమనందించి కాపాడుతుంది.
స్ట్రాబెర్రీలోనూ అధికంగా సి విటమిన్ వుంటుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. ఈ పండును డైరెక్ట్గా తీసుకున్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఈ కాలంలో మంచి ఫలితం వుంటుంది.
డ్రాగన్ ప్రూట్స్, ఖర్జూరం కూడా ఈ కాలంలో తినాల్సిన పండ్ల లిస్టులో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు