‘ధృవనక్షత్రం’ ఈ సారైనా మెరిసేనా.?
- November 18, 2023
మరుగున పడిపోయిన సినిమా ‘ధృవనక్షత్రం’. విక్రమ్, రీతూవర్మ జంటగా ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా ఇది. విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే, కొన్ని ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈ సినిమాని అనుకున్న టైమ్కి ఆయన రిలీజ్ చేయలేకపోయారు.
రీసెంట్గా ఆ సినిమాని బూజు దులిపి రిలీజ్ డేట్ ప్రకటించడంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. ఈ నెల 24న ‘ధృవనక్షత్రం’ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టారు. గౌతమ్ మీనన్ వంటి సీనియర్ దర్శకుడు తన సినిమాని ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోయాడు.? అది కూడా విక్రమ్ వంటి సీనియర్ హీరోతో తీసిన సినిమా... ఇలా పలురకాల అనుమానాలతో కూడిన ప్రశ్నలు ఈ ప్రమోషన్లలో గౌతమ్ మీనన్ ఎదుటకు వస్తున్నాయ్.
వాటన్నింటినీ చాకచక్యంగా ఎదుర్కొంటూ.. ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల అనుకున్న టైమ్కి ఇవ్వాల్సిన వాళ్లకి డబ్బులు చెల్లించకపోవడం, వాళ్లు సినిమాపై కేసులు పెట్టడం.. తదితర కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని ఆయన ఓపెన్ చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా విక్రమ్ అండ్ గౌతమ్ మీనన్ కాంబో మూవీ అంటే ఖచ్చితంగా ఆ సినిమాపై అంచనాలుంటాయ్. సినిమా పాతదైపోయినా.. గౌతమ్ మీనన్ ఫ్లేవర్ ఏదో మ్యాజిక్ చేస్తుందని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరి గౌతమ్ మీనన్ ఆ అంచనాల్ని నిలబెట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఈ నెల 24 వరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







