‘ధృవనక్షత్రం’ ఈ సారైనా మెరిసేనా.?

- November 18, 2023 , by Maagulf
‘ధృవనక్షత్రం’ ఈ సారైనా మెరిసేనా.?

మరుగున పడిపోయిన సినిమా ‘ధృవనక్షత్రం’. విక్రమ్, రీతూవర్మ జంటగా ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా ఇది. విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే, కొన్ని ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి ఆయన రిలీజ్ చేయలేకపోయారు.
రీసెంట్‌గా ఆ సినిమాని బూజు దులిపి రిలీజ్ డేట్ ప్రకటించడంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. ఈ నెల 24న ‘ధృవనక్షత్రం’ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టారు. గౌతమ్ మీనన్ వంటి సీనియర్ దర్శకుడు తన సినిమాని ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోయాడు.? అది కూడా విక్రమ్ వంటి సీనియర్ హీరోతో తీసిన సినిమా... ఇలా పలురకాల అనుమానాలతో కూడిన ప్రశ్నలు ఈ ప్రమోషన్లలో గౌతమ్ మీనన్ ఎదుటకు వస్తున్నాయ్.
వాటన్నింటినీ చాకచక్యంగా ఎదుర్కొంటూ.. ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల అనుకున్న టైమ్‌కి ఇవ్వాల్సిన వాళ్లకి డబ్బులు చెల్లించకపోవడం, వాళ్లు సినిమాపై కేసులు పెట్టడం.. తదితర కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని ఆయన ఓపెన్ చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా విక్రమ్ అండ్ గౌతమ్ మీనన్ కాంబో మూవీ అంటే ఖచ్చితంగా ఆ సినిమాపై అంచనాలుంటాయ్. సినిమా పాతదైపోయినా.. గౌతమ్ మీనన్ ఫ్లేవర్ ఏదో మ్యాజిక్ చేస్తుందని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరి గౌతమ్ మీనన్ ఆ అంచనాల్ని నిలబెట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఈ నెల 24 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com