ఇండియా-కువైట్ మ్యాచ్ తర్వాత భారత కోచ్ ఎమోషనల్ ట్వీట్
- November 19, 2023
కువైట్: కువైట్లోని జాబర్ స్టేడియంలో కువైట్ జాతీయ జట్టును భారత్ ఓడించిన విషయం తెలిసిందే. తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు భారత జాతీయ ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ ధన్యవాదాలు తెలిపారు. "22 ఏళ్ల తర్వాత FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో మా తొలి విజయం. బ్లూటైగర్స్కు మంచి మద్దతు లభిస్తుందని అనుకోలేదు. కానీ భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు నిజంగా హృదయాన్ని కదిలించారు. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు." భారత హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ట్వీట్ చేశాడు. భారత్ కు దూరంగా ఆడినప్పటికీ జబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్కు చాలా మద్దతు లభించిందన్నారు. గురువారం సాయంత్రం తమ జట్టును ఉత్సాహపరిచేందుకు పదివేల మంది భారతీయులు స్టేడియంలోని భారత పెవిలియన్కు తరలివచ్చారు. భారత జట్టును ఉత్సాహపరిచేందుకు చాలా మంది భారతీయులు భారతీయ టీ-షర్టులు ధరించి కుటుంబంతో వచ్చారు. "మేము స్వదేశంలో ఆడుతున్నట్లుగా స్టాండ్ల నుండి మాకు గొప్ప మద్దతు లభించింది. ఇక్కడ గెలవడం ద్వారా, మేము గ్రూప్లో రెండవ స్థానాన్ని పొందే అవకాశం ఉంది." అని కోచ్ ఇగోర్ స్టిమాక్ చెప్పారు. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్లో భువనేశ్వర్లో ఎఎఫ్సి ఆసియా కప్ చాంపియన్ ఖతార్తో తలపడనుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







