1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స.. యూఏఈ
- November 19, 2023
యూఏఈ: 1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. ఈ మేరకు వారికి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. యుద్ధం-దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి అన్ని వయసుల క్యాన్సర్ రోగులకు ఇది వర్తిస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గాజా నుండి పిల్లలు, మహిళలతో కూడిన విమానం అబుదాబికి చేరుకున్నది. గాజాకు సహాయక చర్యలను యూఏఈ నిర్వహిస్తోంది. ఇందుకోసం Gallant Knight 3 కార్యకలాపాలను ప్రారంభించింది. గాజా స్ట్రిప్లో ఒక ఫీల్డ్ హాస్పిటల్ను నిర్మిస్తోంది. అలాగే పాలస్తీనియన్ల నీటి సరఫరా కోసం మూడు డీశాలినేషన్ ప్లాంట్లను నిర్మిస్తోంది యూఏఈ.
తాజా వార్తలు
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్.. ముడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు









