1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స.. యూఏఈ
- November 19, 2023
యూఏఈ: 1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. ఈ మేరకు వారికి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. యుద్ధం-దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి అన్ని వయసుల క్యాన్సర్ రోగులకు ఇది వర్తిస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గాజా నుండి పిల్లలు, మహిళలతో కూడిన విమానం అబుదాబికి చేరుకున్నది. గాజాకు సహాయక చర్యలను యూఏఈ నిర్వహిస్తోంది. ఇందుకోసం Gallant Knight 3 కార్యకలాపాలను ప్రారంభించింది. గాజా స్ట్రిప్లో ఒక ఫీల్డ్ హాస్పిటల్ను నిర్మిస్తోంది. అలాగే పాలస్తీనియన్ల నీటి సరఫరా కోసం మూడు డీశాలినేషన్ ప్లాంట్లను నిర్మిస్తోంది యూఏఈ.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!