1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స.. యూఏఈ
- November 19, 2023
యూఏఈ: 1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. ఈ మేరకు వారికి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. యుద్ధం-దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి అన్ని వయసుల క్యాన్సర్ రోగులకు ఇది వర్తిస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గాజా నుండి పిల్లలు, మహిళలతో కూడిన విమానం అబుదాబికి చేరుకున్నది. గాజాకు సహాయక చర్యలను యూఏఈ నిర్వహిస్తోంది. ఇందుకోసం Gallant Knight 3 కార్యకలాపాలను ప్రారంభించింది. గాజా స్ట్రిప్లో ఒక ఫీల్డ్ హాస్పిటల్ను నిర్మిస్తోంది. అలాగే పాలస్తీనియన్ల నీటి సరఫరా కోసం మూడు డీశాలినేషన్ ప్లాంట్లను నిర్మిస్తోంది యూఏఈ.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







