1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స.. యూఏఈ
- November 19, 2023
యూఏఈ: 1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. ఈ మేరకు వారికి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. యుద్ధం-దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి అన్ని వయసుల క్యాన్సర్ రోగులకు ఇది వర్తిస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గాజా నుండి పిల్లలు, మహిళలతో కూడిన విమానం అబుదాబికి చేరుకున్నది. గాజాకు సహాయక చర్యలను యూఏఈ నిర్వహిస్తోంది. ఇందుకోసం Gallant Knight 3 కార్యకలాపాలను ప్రారంభించింది. గాజా స్ట్రిప్లో ఒక ఫీల్డ్ హాస్పిటల్ను నిర్మిస్తోంది. అలాగే పాలస్తీనియన్ల నీటి సరఫరా కోసం మూడు డీశాలినేషన్ ప్లాంట్లను నిర్మిస్తోంది యూఏఈ.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







