ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం: 4 రోజుల్లో 50 మంది ఖైదీలు విడుదల
- November 23, 2023
యూఏఈ: ఇజ్రాయెల్లో ఖైదు చేయబడిన 150 మంది పాలస్తీనియన్లకు బదులుగా గాజాలో బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే గాజా ఎన్క్లేవ్లోకి మానవతా సహాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ నాలుగు రోజుల విరామానికి బుధవారం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ - హమాస్ అధికారులు ఒప్పందం కుదుర్చుకోవచ్చని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, యుఎస్ తెలిపాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. 200 మందికి పైగా హమాస్ చెరలో ఉన్నారు. 50 మంది మహిళలు, పిల్లలను నాలుగు రోజులలో విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలకు బదులుగా 50 మంది బందీలను విడుదల చేయనున్నట్లు హమాస్ తెలిపింది. యుద్ధ విరమణ ఒప్పందం వందలాది మానవతా, వైద్య మరియు ఇంధన సహాయంతో కూడిన ట్రక్కులను గాజాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది అని హమాస్ వెల్లడించింది. సంధి కాలంలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఎవరిపైనా దాడి చేయకూడదని లేదా అరెస్టు చేయకూడదని ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







