ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం: 4 రోజుల్లో 50 మంది ఖైదీలు విడుదల
- November 23, 2023
యూఏఈ: ఇజ్రాయెల్లో ఖైదు చేయబడిన 150 మంది పాలస్తీనియన్లకు బదులుగా గాజాలో బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే గాజా ఎన్క్లేవ్లోకి మానవతా సహాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ నాలుగు రోజుల విరామానికి బుధవారం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ - హమాస్ అధికారులు ఒప్పందం కుదుర్చుకోవచ్చని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, యుఎస్ తెలిపాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. 200 మందికి పైగా హమాస్ చెరలో ఉన్నారు. 50 మంది మహిళలు, పిల్లలను నాలుగు రోజులలో విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలకు బదులుగా 50 మంది బందీలను విడుదల చేయనున్నట్లు హమాస్ తెలిపింది. యుద్ధ విరమణ ఒప్పందం వందలాది మానవతా, వైద్య మరియు ఇంధన సహాయంతో కూడిన ట్రక్కులను గాజాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది అని హమాస్ వెల్లడించింది. సంధి కాలంలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఎవరిపైనా దాడి చేయకూడదని లేదా అరెస్టు చేయకూడదని ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..









