వారంలో 1,600 ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్.. ఐఫోన్ 15 గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు
- November 23, 2023
యూఏఈ: యూఏఈలోని ఒక సెక్యూరిటీ గార్డు బ్రాండ్-న్యూ ఐఫోన్ 15 బహుమతిగా పొందాడు. నేపాల్ ప్రవాసుడు దీపేష్ చమ్లాగైన్ ఈ బహుమతిని పొందేందుకు ఒక వారంలో దాదాపు 1,600 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేశాడు. టెక్నాలజీ కంపెనీ రెనీ ఈ బహుమతిని అందజేసింది. ఈ సందర్భాం దీపేష్ మాట్లాడుతూ.. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎలా హాని కలిగిస్తుందో ఆలోచించకుండా ప్రజలు ప్లాస్టిక్ని ఎలా విసిరివేయడం తనకు ఎప్పుడూ నచ్చలేదన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది సహాయంతో తాను బాటిళ్లను సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెనీ సంస్థ యూఏఈ అంతటా 1,000 స్మార్ట్ బిన్లను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక ప్లాస్టిక్ సీసాని రీసైకిల్ చేసిన తర్వాత, అది అతని/ఆమె ఖాతాలో నమోదు చేయబడుతుందని, పర్యావరణ సృహను ప్రొత్సాహించేందుకు డ్రా నిర్వహించిన విజేతలకు బహుమతులను అందజేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శాండర్ వాన్ వేస్ వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







