వారంలో 1,600 ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్.. ఐఫోన్ 15 గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు
- November 23, 2023
యూఏఈ: యూఏఈలోని ఒక సెక్యూరిటీ గార్డు బ్రాండ్-న్యూ ఐఫోన్ 15 బహుమతిగా పొందాడు. నేపాల్ ప్రవాసుడు దీపేష్ చమ్లాగైన్ ఈ బహుమతిని పొందేందుకు ఒక వారంలో దాదాపు 1,600 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేశాడు. టెక్నాలజీ కంపెనీ రెనీ ఈ బహుమతిని అందజేసింది. ఈ సందర్భాం దీపేష్ మాట్లాడుతూ.. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎలా హాని కలిగిస్తుందో ఆలోచించకుండా ప్రజలు ప్లాస్టిక్ని ఎలా విసిరివేయడం తనకు ఎప్పుడూ నచ్చలేదన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది సహాయంతో తాను బాటిళ్లను సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెనీ సంస్థ యూఏఈ అంతటా 1,000 స్మార్ట్ బిన్లను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక ప్లాస్టిక్ సీసాని రీసైకిల్ చేసిన తర్వాత, అది అతని/ఆమె ఖాతాలో నమోదు చేయబడుతుందని, పర్యావరణ సృహను ప్రొత్సాహించేందుకు డ్రా నిర్వహించిన విజేతలకు బహుమతులను అందజేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శాండర్ వాన్ వేస్ వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







