వారంలో 1,600 ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్.. ఐఫోన్ 15 గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు
- November 23, 2023
యూఏఈ: యూఏఈలోని ఒక సెక్యూరిటీ గార్డు బ్రాండ్-న్యూ ఐఫోన్ 15 బహుమతిగా పొందాడు. నేపాల్ ప్రవాసుడు దీపేష్ చమ్లాగైన్ ఈ బహుమతిని పొందేందుకు ఒక వారంలో దాదాపు 1,600 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేశాడు. టెక్నాలజీ కంపెనీ రెనీ ఈ బహుమతిని అందజేసింది. ఈ సందర్భాం దీపేష్ మాట్లాడుతూ.. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎలా హాని కలిగిస్తుందో ఆలోచించకుండా ప్రజలు ప్లాస్టిక్ని ఎలా విసిరివేయడం తనకు ఎప్పుడూ నచ్చలేదన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది సహాయంతో తాను బాటిళ్లను సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెనీ సంస్థ యూఏఈ అంతటా 1,000 స్మార్ట్ బిన్లను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక ప్లాస్టిక్ సీసాని రీసైకిల్ చేసిన తర్వాత, అది అతని/ఆమె ఖాతాలో నమోదు చేయబడుతుందని, పర్యావరణ సృహను ప్రొత్సాహించేందుకు డ్రా నిర్వహించిన విజేతలకు బహుమతులను అందజేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శాండర్ వాన్ వేస్ వివరించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







