వారంలో 1,600 ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్.. ఐఫోన్ 15 గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు
- November 23, 2023
యూఏఈ: యూఏఈలోని ఒక సెక్యూరిటీ గార్డు బ్రాండ్-న్యూ ఐఫోన్ 15 బహుమతిగా పొందాడు. నేపాల్ ప్రవాసుడు దీపేష్ చమ్లాగైన్ ఈ బహుమతిని పొందేందుకు ఒక వారంలో దాదాపు 1,600 ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేశాడు. టెక్నాలజీ కంపెనీ రెనీ ఈ బహుమతిని అందజేసింది. ఈ సందర్భాం దీపేష్ మాట్లాడుతూ.. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎలా హాని కలిగిస్తుందో ఆలోచించకుండా ప్రజలు ప్లాస్టిక్ని ఎలా విసిరివేయడం తనకు ఎప్పుడూ నచ్చలేదన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది సహాయంతో తాను బాటిళ్లను సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రెనీ సంస్థ యూఏఈ అంతటా 1,000 స్మార్ట్ బిన్లను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక ప్లాస్టిక్ సీసాని రీసైకిల్ చేసిన తర్వాత, అది అతని/ఆమె ఖాతాలో నమోదు చేయబడుతుందని, పర్యావరణ సృహను ప్రొత్సాహించేందుకు డ్రా నిర్వహించిన విజేతలకు బహుమతులను అందజేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు శాండర్ వాన్ వేస్ వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









