రోడ్ల పై బెలూన్ టైర్ల వాడకంపై మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- November 25, 2023
దోహా: తమ వాహనాలపై బెలూన్ టైర్లను ఉపయోగించినప్పుడు జాగ్రత్త వహించాలని వాహనదారులను అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. మెటీరియల్ను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొంది. సుగమం(పేవ్డ్) చేసిన రోడ్లపై బెలూన్ టైర్లను ఉపయోగించడం వల్ల కారు ప్రమాదాన్ని చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మినిస్ట్రీ ఓ వీడియోను షేర్ చేసింది. బెలూన్ టైర్లు స్లిప్పరీగా ఉంటాయని, పేలిపోయే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది అరిగిపోయే అవకాశం ఉందని, అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు లేదా గంటకు 100కిమీ వేగంతో నడపబడినప్పుడు విస్తరించే ధోరణిని కలిగి ఉంటుందని తెలిపారు. వీడియోలో వాహనం రోడ్డుపై నియంత్రణ కోల్పోయే ముందు ఒక నిర్దిష్ట వేగంతో కదులుతున్నట్లు కనిపించింది. ఈ టైర్లు ఇసుకతో కూడిన భూభాగాల కోసం మాత్రమే తయారు చేయబడ్డాయని, చదును చేయబడిన రోడ్ల కోసం లేదా అధిక వేగంతో నడపడానికి ఉద్దేశించినవి కాదని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







