రాగి పాత్రలో వుంచిన నీళ్లు ఆరోగ్యానికి మంచివే.! కానీ.!
- November 25, 2023
రాత్రి పూట రాగి గ్లాసులో నీళ్లు నింపి, తెల్లారి లేవగానే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది నమ్ముతుంటారు. అవును నిజమే, రాగి పాత్రలో వుంచిన మంచి నీళ్లు ఆరోగ్యానికి మంచివే. అలా తాగడం వల్ల కడుపు, మూత్ర పిండాలు, కాలేయం శుద్ధి చేయడానికి సహాయ పడుతుంది. తద్వారా ఆరోగ్యం మన సొంతమవుతుంది. కానీ, రాగి పాత్రలో కొన్ని ఆహార పదార్ధాలను నిల్వ చేయరాదు.
అలా నిల్వ చేసిన వాటిని అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పాత్రలో వుంచిన పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. పాలు, ఫాల ఉత్పత్తులు అంటే పెరుగు మజ్జిగ తదితర ఆహార పదార్ధాలు రాగి పాత్రలో నిల్వ చేయడం వల్ల వాటిలోని ఖనిజాలు రాగితో కెమికల్ రియాక్షన్ జరుపుతాయ్.
తద్వారా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలున్నాయ్. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తి తీవ్రమైన నీరసం ఆవహిస్తుంది. అలాగే, రాగి పాత్రలో పచ్చళ్లు గట్రా నిల్వ చేయరాదని ఓ సర్వేలో తేలింది.
రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు ఆరోగ్యానికి మంచివి కదా అని.. అన్ని రకాల పదార్ధాలూ మంచివే అనుకుంటే పొరపాటే సుమండీ. కేవలం PH స్థాయి 6.0 కన్నా తక్కువ వున్న ఆహార పదార్ధాలను మాత్రమే రాగి పాత్రలో నిల్వ చేయాలి.. అని రీసెంట్గా ఓ సర్వేలో తేలింది. సో, రాగి పాత్రలను ఆహారానికి ఉపయోగించే క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరి.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!