భారత పౌరుల సమస్యలను పరిష్కరించిన ఓపెన్ హౌజ్
- November 28, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన ఓపెన్ హౌజ్ ను ఏర్పాటు చేసారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రవాసులు పాల్గొన్నారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యల పరిష్కారం పట్ల రాయబారి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు వారి సత్వర మద్దతు మరియు సహకారం కోసం తన కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా అవసరమైన భారతీయ పౌరులకు బోర్డింగ్, వసతిని అందించడంతోపాటు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు మరియు టిక్కెట్లను మంజూరు చేయడం ద్వారా ఇంటి పనిమనిషితో సహా కష్టాల్లో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేస్తూనే ఉందన్నారు. ఓపెన్ హౌజ్ లో పాల్గొన్నందుకు అన్ని భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సభ్యులకు రాయబారి జాకబ్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!