ఢిల్లీ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు మృతి
- November 28, 2023
న్యూఢిల్లీ: గుండెపోటు.. ఒకప్పుడు వయసు పైబడిన వారికి, అరుదుగా మధ్యవయస్కులకు మాత్రమే వచ్చేది. గుండె పోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా పెద్ద వయస్కులదే ఎక్కువగా ఉండేది. అయితే, మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లతో ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రిలో చేరుతున్న వారు కొందరైతే, కొంతమంది మాత్రం స్పాట్ లోనే కన్నుమూస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ ఆరేళ్ల బాలుడు గుండెపోటుతో చనిపోయాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్సతో కోలుకున్నట్లే కోలుకున్న బాలుడు.. తర్వాత మరోమారు జబ్బుబారిన పడ్డాడు. ఈసారి ఆసుపత్రిలో చేరి ఇంటికి తిరిగిరాలేదు. ఆ బాలుడి మరణానికి కారణం గుండెపోటేనని వైద్యులు నిర్ధారించారు. రక్త పరీక్షలో బాబు మయోకార్డిటిస్ వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రాహుల్ జైన్ కు ఒక్కడే కొడుకు.. ఆరేళ్ల విహాన్ జైన్ ఇండోర్ లోని ఓ కార్పొరేట్ స్కూలులో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇటీవల విహాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకున్నాడు.
ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం రాహుల్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లాడు. అక్కడ మరోసారి విహాన్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విహాన్ శనివారం రాత్రి గుండెపోటుకు గురై చనిపోయాడు. వైద్య పరీక్షల్లో విహాన్ కు మయోకార్డిటిస్ అనే వైరస్ సోకినట్లు గుర్తించామని డాక్టర్లు చెప్పారు. ఈ వైరస్ గుండె కండరాలపై ప్రభావం చూపుతుందని, కండరాల వాపునకు కారణమవుతుందని వివరించారు. దీంతో గుండెకు రక్తం సరఫరాలో అవాంతరాలు ఎదురవుతాయని, ఫలితంగా గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని డాక్టర్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









