ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- November 28, 2023
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో 17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. 41 మంది కార్మికుల్లో 34 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు. మిగిలిన కార్మికులను బయటికి రప్పిస్తున్నారు.
కాగా, దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హర్షం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన స్పందిస్తూ.. టన్నెల్లో నిర్మించిన తాత్కాలిక వైద్య శిబిరంలో కార్మికులందరికీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బయటికి వచ్చిన కార్మికులను ఓదారుస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.
తాజా వార్తలు
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం









