ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- November 28, 2023
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో 17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. 41 మంది కార్మికుల్లో 34 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు. మిగిలిన కార్మికులను బయటికి రప్పిస్తున్నారు.
కాగా, దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హర్షం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన స్పందిస్తూ.. టన్నెల్లో నిర్మించిన తాత్కాలిక వైద్య శిబిరంలో కార్మికులందరికీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బయటికి వచ్చిన కార్మికులను ఓదారుస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







