ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..

- November 28, 2023 , by Maagulf
ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో 17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. 41 మంది కార్మికుల్లో 34 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు. మిగిలిన కార్మికులను బయటికి రప్పిస్తున్నారు.

కాగా, దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హర్షం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన స్పందిస్తూ.. టన్నెల్‌లో నిర్మించిన తాత్కాలిక వైద్య శిబిరంలో కార్మికులందరికీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బయటికి వచ్చిన కార్మికులను ఓదారుస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com