తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- November 28, 2023
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది నిమిషాల్లోనే తెరపడనుంది. గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. బహిరంగ సభలు రోడ్డు షోలు కార్నర్ మీటింగ్లు ఇలా వచ్చిన ప్రతి మార్గం గుండా ప్రజలకు చేరువయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈతరుణంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక సందేశం ఇచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన సోనియా గాంధీ ఎన్నికలకు రెండు రోజుల ముందు వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తవ్వడం చూడాలనుకుంటున్నా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజల తెలంగాణ మనందరం కలిసి మార్చాలి మీ కలలు సహకారం అవ్వాలి మీకు మంచి ప్రభుత్వము లభించాలని పిలిచి నాకు చాలా గౌరవించాలి ఈ ప్రేమ అభిమానాలు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను తెలంగాణ సోదరులు అమ్మలు బిడ్డలకు నా విన్నపం మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేయండి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని వీడియో ద్వారా సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు.
సోనియమ్మ సందేశం
— Revanth Reddy (@revanth_anumula) November 28, 2023
తల్లికి బిడ్డపై ప్రేమ వెలకట్టలేనిది…
తెలంగాణ బిడ్డల పై నా ప్రేమ అలాంటిదే.
నేను మీ దగ్గరకు రాలేకపోవచ్చు…
నా మనసెప్పుడూ మీకు దగ్గరగానే ఉంటుంది.
మన కలల తెలంగాణ సాకారం కోసం…
మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి#MaarpuKavaliCongressRavali#CongressVijayabheriYatra… pic.twitter.com/tX787e2tuH
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







