ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళలు మార్పు
- November 29, 2023
దోహా: ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళల్లో మార్పు చేస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రానికి (ట్రయల్ ప్రాతిపదికన) సమయాన్ని మార్చినట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపలు, సీఫుడ్ వేలం నిర్వహించే సమయం మగ్రిబ్ ప్రార్థన తర్వాత (సూర్యాస్తమయం తర్వాత) కాలానికి మార్చినట్లు తెలిపింది. ఈ నిర్ణయం సరసమైన ధరలకు చేపలు, సముద్రపు ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది. అదే సమయంలో మత్స్యకారులకు గరిష్ట డిమాండ్ సమయంలో వారి అమ్మకాలను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







