ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళలు మార్పు
- November 29, 2023
దోహా: ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళల్లో మార్పు చేస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రానికి (ట్రయల్ ప్రాతిపదికన) సమయాన్ని మార్చినట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపలు, సీఫుడ్ వేలం నిర్వహించే సమయం మగ్రిబ్ ప్రార్థన తర్వాత (సూర్యాస్తమయం తర్వాత) కాలానికి మార్చినట్లు తెలిపింది. ఈ నిర్ణయం సరసమైన ధరలకు చేపలు, సముద్రపు ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది. అదే సమయంలో మత్స్యకారులకు గరిష్ట డిమాండ్ సమయంలో వారి అమ్మకాలను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







