ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌లో చేపల వేలం వేళలు మార్పు

- November 29, 2023 , by Maagulf
ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌లో చేపల వేలం వేళలు మార్పు

దోహా: ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌లో చేపల వేలం వేళల్లో మార్పు చేస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఉదయం నుంచి సాయంత్రానికి (ట్రయల్ ప్రాతిపదికన) సమయాన్ని మార్చినట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌లో చేపలు,  సీఫుడ్ వేలం నిర్వహించే సమయం మగ్రిబ్ ప్రార్థన తర్వాత (సూర్యాస్తమయం తర్వాత) కాలానికి మార్చినట్లు తెలిపింది. ఈ నిర్ణయం సరసమైన ధరలకు చేపలు, సముద్రపు ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది.  అదే సమయంలో మత్స్యకారులకు గరిష్ట డిమాండ్ సమయంలో వారి అమ్మకాలను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com