ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళలు మార్పు
- November 29, 2023
దోహా: ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపల వేలం వేళల్లో మార్పు చేస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రానికి (ట్రయల్ ప్రాతిపదికన) సమయాన్ని మార్చినట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో చేపలు, సీఫుడ్ వేలం నిర్వహించే సమయం మగ్రిబ్ ప్రార్థన తర్వాత (సూర్యాస్తమయం తర్వాత) కాలానికి మార్చినట్లు తెలిపింది. ఈ నిర్ణయం సరసమైన ధరలకు చేపలు, సముద్రపు ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించింది. అదే సమయంలో మత్స్యకారులకు గరిష్ట డిమాండ్ సమయంలో వారి అమ్మకాలను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









