సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్.! ఎవరు గెలుస్తారో తేలిపోతుంది.!

- November 30, 2023 , by Maagulf
సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్.! ఎవరు గెలుస్తారో తేలిపోతుంది.!

ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత వెల్లడయ్యే అవకాశం వుంది. ఇప్పటికే చాలా సర్వేలు శాంపిల్స్ తీసేసుకోగా, పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఓటర్ల మొబైల్ పోన్లకు కాల్స్ వెళుతున్నాయి.

‘మీరు ఎవరికి ఓటు వేశారు.?’ అంటూ ఐవీఆర్ కాల్స్ వస్తుండడంతో ఓటర్లకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. పోలింగ్ బూతులకు సమీపంలో కూడా ఓటర్లను ఈ ‘శాంపిల్స్’ కోసం ఇబ్బంది పెడుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తోన్న సంస్థలు.
సాయంత్రం మీడియా సమావేశం.. అంటూ ఆయా సంస్థలు, మీడియాకి కూడా సమాచారం పంపేశాయి ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్లడికి సంబంధించి. ఇటీవలి కాలంలో ఇదో కొత్త ఒరవడి అనుకోవాలేమో.!

కాగా, సర్వేల పేరుతోనూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న తీరు చూసి, ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు.

ఇదిలా వుంటే, మేమే గెలుస్తాం.. అంటూ ఆయా పార్టీలు ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఫేక్ సర్వేలను తమ అనుకూల మీడియా సంస్థల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళి, ఓటర్లను అయోమయంలో పడేసిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com