గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. ఆరుగురు మృతి

- December 02, 2023 , by Maagulf
గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. ఆరుగురు మృతి

గాజా: దాదాపు వారం రోజుల శుక్రవారం కాల్పుల విరమణ గడువు ముగిసిన కొద్దిసేపటి గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడిని మొదలుపెట్టింది.  అంతకుముందు గాజా నుండి ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించానలి ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. బాంబు దాడులను చేసింది. ఇదిలా ఉండగా తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది.  గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. కాగా, ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణకు ముందు అమలులో ఉన్న ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com