మమతా బెనర్జీ శుక్రవారం పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం..
- May 26, 2016తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక రెడ్ రోడ్లో పెద్దఎత్తున జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమెతో పాటు మరో 41 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా, గాయకుడు ఇంద్రనీల్ సేన్, కోల్కతా మేయర్ శోవన్తో పాటు మొత్తం 17 మందికి ఈసారి మంత్రివర్గంలో కొత్తగా అవకాశం దక్కనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రి, భూటాన్ ప్రధానమంత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ హాజరు కానున్నారని ఆమె వివరించారు. దీనికి ప్రజలందరూ ఆహ్వానితులేనని తెలిపారు.పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రత్యేకమైన జమ్దానీ చీర, 20 కిలోల హిల్షా చేప, బెల్లాన్ని బహూకరించనుంది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం