ఎలాంటి సైడ్ ఎఫెక్టుల్లేకుండా నిద్రలేమికి చెక్ పెట్టేయండిలా.!
- December 05, 2023
కార్డిసాల్ అనే హార్మోన్ అధికంగా రిలీజ్ కావడం వల్ల ఒత్తిడి, అనవసరమైన ఆందోళన, కంగారు వంటి సమస్యలు ఏర్పడతాయ్. ఈ సమస్యలు నిద్రలేమికి కారణం.
తగినంత నిద్ర లేకుంటే, ఆరోగ్యంపై అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయ్. నిద్రలేమి సమస్యకు మార్కెట్లో అనేక మందులు అందుబాటులో వున్నాయ్.
అయితే, అన్ని రకాల మెడిసెన్స్ వాడడం వల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్టులు సంభవించొచ్చు. చాలా అరుదుగా ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు.
అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా నిద్రలేమి సమస్యను ఎదుర్కోవాలంటే ఆయుర్వేదంలో అశ్వగంధ పొడిని వినియోగించడం వుత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
అశ్వగంధను ఆయుర్వేదంలో ప్రముఖంగా వినియోగిస్తుంటారు. ఈ అశ్వగంధ పొడిని రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లల్లో కలిపి తీసుకోవడం వల్ల నిద్ర లేమి సమస్య తీరుతుంది.
అశ్వగంధలోని త్రి ఇధైల్ గ్లైకాల్ కార్డిసాల్ హార్మోన్ విడుదలను కంట్రోల్లో వుంచుతుంది. తద్వారా మెదడుకు పాజిటివ్ ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతత.. అలాగే ప్రశాంతమైన నిద్ర సొంతమవుతాయ్.
అంతేకాదండోయ్. ఈ పొడిని వాడడం వల్ల మెదడు చురుగ్గా పని చేయడంతో, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!